Hyderabad Crime: హైదరాబాద్లో BMW కారు బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ చింతలకుంట దగ్గర ఈ ఘటన జరిగింది. అతివేగంతో వచ్చిన BMW కారు.. వేగనార్ని వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
AP 27 BP 3333 నంబర్ గల BMW కారు హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వచ్చే క్రమంలో నందన్ అనే వ్యక్తి అతివేగంగా వెహికల్ డ్రైవ్ చేసినట్టు చెప్తున్నారు. BMW కారులో అన్ని సేఫ్టీ బెలూన్లు తెరుచుకోవడంతో అందులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ముందు వెళ్తున్న వేగనార్లోని వ్యక్తి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఊకోండి గ్రామానికి చెందిన మల్లేష్ గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ నందన్.. విజయవాడ నుంచి హబ్సిగూడకు వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.