Hyderabad : హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin), కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendar Reddy) సహా మరో ఆరుగురిపై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు నరేష్ పేర్కొన్నాడు.
బాబా ఫసియుద్దీన్ దాడి చేశారని బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బోరబండ, కోస్గి పోలీసులు రెండు రోజుల నుంచి బాబా ఫసియుద్దీన్ కోసం గాలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కోస్గి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.