Hyderabad : హైదరాబాద్లో రోడ్డ ప్రమాదం జరిగింది. మియాపూర్లోని డీఏవీ స్కూల్ సీమపంలో వేగంగా వస్తున్న ఓ కారు స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అప్పటికే యువకుడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కెసు నమోదు చుసుకున్న పోలీసులు కారు యజమానిని అదుపులొకి తీసుకొని విచారిస్తున్నారు.