Hyderabad : హైదరాబాద్ మెట్రో రైల్లో నిరుద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదంటూ మండిపడ్డారు. పట్టభద్రుల వేషధారణలో ప్రయాణికుల్ని యాచించారు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తానంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొలువులు మీకు, కన్నీళ్లు మాకా అంటూ ప్రశ్నించారు.