Home Voting Started in Hyderabad: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో హోం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 121 మంది ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. వీరిలో 86 మంది సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు 35 మంది ఉన్నారు.
శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సిబ్బంది.. హోం ఓటింగ్ కు అప్లై చేసుకున్నవారి ఇళ్లకు వెళ్లి.. ఓటు వేయిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ హోం ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. హోం ఓటింగ్ కు నమోదు చేసుకున్నవారంతా.. నేడు, రేపు ఎన్నికల సిబ్బందికి అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు.