EPAPER
Kirrak Couples Episode 1

Mallareddy: ఆ ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు.. మల్లారెడ్డి కేసులో హైకోర్టు స్టే..

Mallareddy: ఆ ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దు.. మల్లారెడ్డి కేసులో హైకోర్టు స్టే..

Mallareddy: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పరస్పర కేసులతో ఉత్కంఠ కొనసాగుతోంది. తనపై మల్లారెడ్డి తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు తొలగించాలంటూ పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కేసునైతే తొలగించలేదు కానీ.. నాలుగు వారాల పాటు ఐటీ అధికారిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది. రత్నాకర్ పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది.


అసలేం జరిగిందంటే..
ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్ పై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదాయపన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని.. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్‌రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని.. సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. స్పందించిన పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్‌పై ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐటీ అధికారి రత్నాకర్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రత్నాకర్‌పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది.

మరోవైపు, మల్లారెడ్డిపై ఐటీ శాఖ సైతం పోలీసులకు పలు ఫిర్యాదులు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించడం.. దౌర్జన్యం చేయడం.. ఆధారాలు ధ్వంసం చేయడం.. తదితర ఆరోపణలతో పలు సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇలా, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో.. ఐటీ దాడుల కేసులో అనేక ట్విస్టులకు దారి తీస్తోంది.


అటు, ల్యాప్ టాప్ వ్యవహారం సైతం మల్లారెడ్డి మెడకు చిక్కుకునేలా ఉంది. ఐటీ అధికారి రత్నకుమార్‌ తన ల్యాప్‌టాప్‌ చోరీ అయిందని, అందులో ఉన్న విలువైన డాటా తొలగించారని… మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అదే రోజు రాత్రి ఆ ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ఐటీ అధికారులు మాత్రం ల్యాప్‌టాప్‌ తీసుకునేందుకు రాలేదు. ఆ ల్యాప్ టాప్ తనది కాదన్నారు రత్నాకర్. దీంతో, ల్యాప్‌టాప్‌ ను సీజ్ చేసి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు పోలీసులు.

ఇలా మల్లారెడ్డి వర్సెస్ ఐటీ ఆఫీసర్ రత్నాకర్ ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగుతోంది. పరస్పర కేసులతో ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Big Stories

×