TSPSC: గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనేది సోమవారం చెప్పాలంటూ TSPSCని ఆదేశించింది. దీంతో మండే రోజు పరీక్ష నిర్వహణపై అటో ఇటో తేలిపోనుంది.
గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై కోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. మిగిలిన పరీక్షల కారణంగా గ్రూప్2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును అభ్యర్థించగా.. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సమయంలో వాయిదా కష్టమని TSPSC వాదనలు వినిపించింది. అయితే, గ్రూప్-2 పరీక్ష నిర్వాహణపై సోమవారం స్పష్టమైన ప్రకటన చేస్తామని హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కచ్చితంగా ఆ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. సోమవారానికి విచారణ వాయిదా వేసింది కోర్టు.
ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే.. గ్రూప్-2 పరీక్ష ను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల టీచర్ తో పాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చర్ల పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అగస్ట్ 2నుండి 30వరకు రకరకాల పరీక్షలు ఉన్నాయని.. గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంలో 90 శాతం మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష నిర్వయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని కోర్టుకు తెలిపారు.
అయితే, తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారుని.. కానీ గురుకుల్ పరీక్ష కు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని TSPSC కోర్టుకు తెలిపింది. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. ఎంపిక చేసిన 1,535 సెంటర్లలో పరీక్ష నిర్వహించే రోజు సెలవులు ప్రకటించామని తెలిపింది. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో పిటిషన్ వేసింది కేవలం 150 మంది మాత్రమే అని గుర్తు చేసింది.