EPAPER

Telangana Weather Report: కూల్ డేస్ అయిపోయాయ్.. ఇక జర భద్రం.. హెచ్చరించిన ఐఎండీ!

Telangana Weather Report: కూల్ డేస్ అయిపోయాయ్.. ఇక జర భద్రం.. హెచ్చరించిన ఐఎండీ!

Telangana Weather Report: మండుటెండల నుంచి మధ్యలో మూడు, నాలుగు రోజులు తెలంగాణ ప్రజలకు స్వల్ప ఉపశమనం లభించింది. సముద్ర ఉపరితలంపై ఏర్పడిన ద్రోణి కారణంగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక కూల్ డేస్ అయిపోయాయ్. మళ్లీ మండుటెండల కాలం మొదలైంది. నిన్నటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. హైదరాబాద్ లోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలో ఐఎండీ కీలక హెచ్చరిక జారీ చేసింది.


రానున్న రెండు, మూడు రోజుల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పెరుగుతాయని తెలిపింది. 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. మండుటెండల నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఆదివారం రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను తాకాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Also Read: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న రెండు రోజులు భయటకు రావొద్దు..!

మరోవైపు ఏపీలోనూ ఎండలు మాడు పగలగొడుతున్నాయి. అర్జెంటు పనులున్నా బయటకు రావాలంటే జంకాల్సిన పరిస్థితి. అసలే పెళ్లిళ్ల సీజన్. ఏప్రిల్ నెలాఖరులోగా ముహూర్తాలు చాలానే ఉన్నాయి. పెళ్లిపనులు చకచకా జరగాలంటే.. తప్పనిసరిగా బయటికి రాక తప్పదు. అలా పనులకోసం బయటికొచ్చిన వారు.. తిరిగి ఇళ్లకు చేరేసరికి నీరసించిపోతున్నారు. మండేకాలం కష్టాలు తీరాలంటే మే దాటాల్సిందే.

డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు తరచూ మంచినీళ్లు.. అందులోనూ మట్టికుండలో ఉంచిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకూ ఐస్ క్రీమ్ లు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఇంట్లోనే తయారు చేసుకున్న మజ్జిగ, నిమ్మరసం, సబ్జా వాటర్ లతో పాటు.. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×