Heavy Rain Fall: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కూడా మేఘావృతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భారీగా వర్షం కురవడం ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం కొద్ది మేరకు వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, జేఎన్టీయూ, మూసాపేట్, అమీర్ పేట్, పంజాగుట్ట, యూసుఫ్ గూడతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
Also Read: రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త.. స్టేషన్లలో ఇక నుంచి క్యూఆర్ కోడ్తో పేమెంట్స్
వరద నీరు రోడ్లపైకి భారీగా వచ్చి చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సాయంత్రం సమయం కావడంతో ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వర్షం కురిసి వరద నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత విభాగాల సిబ్బంది ఆ వరద నీరును క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.