Kagaznagar : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా కాగజ్నగర్ మండలం ఇస్గాం పోలీస్ స్టేషన్లో బ్లుకోల్ట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దయానంద్(55) కు గుండెపోటు వచ్చింది. డ్యూటీలో ఉన్న పోలీసులు వెంటనే కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు.
పరీక్షలు నిర్వహించిన వైద్యులు కానిస్టేబుల్ మృతి చెందినట్లు నిర్దారించారు. దయానంద్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఉమ్రి గ్రామం. 33 సంవత్సరాలుగా ఆయన పోలీస్ గా సేవలు అందిస్తున్నారు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .
దయానంద్ గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న, డిఎస్పీ ఏ కరుణాకర్, రూరల్ సీఐ నాగరాజ్, ఎస్ఐలు రామన్ కుమార్, శ్రీకాంత, కానిస్టేబుల్స్ శంకర్, శేఖర్ ఆస్పత్రికి చేరుకుని.. మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.