Harishrao : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ఆర్థికమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్గా నిలుస్తుందని స్పష్టం చేశారు.
అసెంబ్లీకి చేరుకోవడానికి ముందు హరీశ్ రావు బడ్జెట్ కాపీలతో జూబీహిల్స్ టీటీడీ ఆలయానికి వెళ్లారు. అక్కడ శ్రీవారికి పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్లారు.
తెలంగాణలో ఎన్నికల ఏడాది కావడంతో ప్రజలు బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రజారంజక బడ్జెట్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది. సాగు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.