EPAPER

Harish rao: నిర్మలకు హరీశ్ లేఖ.. సీఎస్ఎస్ నిధుల కోసం రిక్వెస్ట్

Harish rao: నిర్మలకు హరీశ్ లేఖ.. సీఎస్ఎస్ నిధుల కోసం రిక్వెస్ట్

Harish rao: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులు రూ.495 కోట్లను తిరిగి తెలంగాణకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 2014-15లో సీఎస్‌ఎస్‌ కింద తెలంగాణకు రావాల్సిన నిధులను పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని విన్నవించారు. గతంలో ఇదే అంశంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందనని హరీశ్ రావు అన్నారు. ఇప్పటికైనా స్పందించి నిధులను ఇప్పించాలని నిర్మల సీతారామన్ ను కోరారు.


రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాది 2014-15లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారు. అయితే పొరపాటున మొత్తంం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదం తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు..రాకుండా పోయాయని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర, ఏపీ ప్రభుత్వాలతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లామని.. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు.

8 సంవత్సరాలు గడుస్తున్నా.. రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని హరీశ్ రావు అన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేఖలో పేర్కొన్నారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×