Harishrao Comments: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం.. పేద ప్రజలకు శాపంగా మారింది. రాష్ట్రంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొన్నది.
Also Read: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ
ఇటీవల ఒక్కరోజే డెంగీ వల్ల ఐదుగురు మృతిచెందారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలి’ అంటూ ఆయన ఫైరయ్యారు.