Telangana Debts: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడి-వేడిగా వాదనలు జరుగుతున్నాయి. శ్వేతపత్రంలో చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించగా.. ఆయన ప్రసంగంపై కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు అభ్యంతరం తెలిపారు. హరీష్ రావు కేంద్రంపై గతంలో మాట్లాడినట్లే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.
రాష్ట్ర బడ్జెట్ పై తమకు కూడా అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్పొరేషన్ రుణాలపై అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రాష్ట్రంలో నిర్మాణాలను కూలగొట్టి.. మళ్లీ కట్టి నిధులన్నింటినీ వృథా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెక్రటేరియట్ ను కూల్చివేసి మళ్లీ ఎందుకు కట్టారు ? డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాత్రం ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.