Harish Rao : ఉద్యోగులకి ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోవడానకి కారణం కేంద్రమే అంటున్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు. మోడల్ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వం వదిలేస్తే రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం 40వేల కోట రూపాయలు వాటాగా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదన్నారు. గత ఆరేళ్లల్లో ఏనాడు ప్రభుత్వం జీతాలు లేటుగా ఇవ్వలేదన్నారు. త్వరలో విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.