Gutha Sukhender Reddy : తెలంగాణపై జరుగుతున్న కుట్రల వెనుక సమైక్యవాదులతో పాటు ప్రధాని మోదీ హస్తం ఉందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసేందుకు మూకుమ్మడి దాడి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ దత్త పుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేస్తోందని మండిపడ్డారు.