TSPSC Group 1 Mains Exam 2024: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అదిరిపోెయే శుభవార్త అందింది. ఎట్టకేలకు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. గతంలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన నోటీఫికేషన్ విడుదలైన తర్వాత ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తాజాగా, తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.
అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు సంబంధించిన తుది కీలో సరైన సమాధానం ఇవ్వలేదని పలువురు ఆరోపించారు. దీంతోపాటు ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.