Yashaswini Reddy : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపై భారీ మెజార్టీతో గెలుపొందిన యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం.. స్వగ్రామానికి విచ్చేసారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గ్రాండ్గా వెల్కమ్ చెప్పాయి. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి స్టేజ్ వద్ద మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డిపల్లి నుండి పాలకుర్తి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాలకుర్తిలోని స్వయంభూ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజులు జరిపించారు. ఆ తర్వాత కార్యకర్తల సమావేశంలో యశస్విని రెడ్డి పాల్గొన్నారు.
26 ఏళ్ల యశస్విని రెడ్డి 47634 ఓట్ల మెజారిటీతో ఎర్రబెల్లి దయాకర్రావుపై పాలకుర్తి నియోజకవర్గంలో విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే.