Republic Day : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
గత పదేళ్లలో తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగిందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన చేస్తేనే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్ధ పాలనతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని ప్రకటించారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని గవర్నర్ తమిళసై ప్రసంగంలో తెలిపారు.
.
.