EPAPER

Governor Kota MLCs: ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్

Governor Kota MLCs: ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్

Kodandaram and Aamir Ali Khan as Governor Kota MLCs (Telangana today news): తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లు శాసనమండలిలో అడుగుపెట్టారు. ఈ మేరకు ఇద్దరితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సంద్భంగా వారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ సి.మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.


ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వా త కోదండరామ్ మాట్లాడారు. తాను ఎమ్మెల్సీగా నియామకం కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ పదవిని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నేను ఎప్పుడూ ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని ప్రకటించారు. ఈ పదవి చాలామంది బలిదానాలు చేయడంతో వచ్చిందని, వాళ్లను ఎప్పటికీ మరవమని పేర్కొన్నారు.

Also Read: ఆడపడుచులను అగౌరవపరిచే సంస్కృతి కాదు మాది: కేటీఆర్


కాంగ్రెస్ ప్రభుత్వం వీరిద్దరిని గతంలోనే నామినేట్ చేయగా.. ఈ విషయంపై బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. నియామక గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీగా నియామించాలంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Related News

Dussehra bonus: సింగరేణి కార్మికులకు శుభవార్త.. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా : సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Big Stories

×