ద్రవరూప గంజాయిని విక్రయిస్తుండగా ఏడుగురిని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన క్యాసంపల్లి తండా శివారులో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ద్రవ రూపంలో ఉన్న గంజాయిని తెచ్చి మరో ఐదుగురు యువకులకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
వీరి నుంచి 39 సీసాల్లో గంజాయి ద్రవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో గంజాయి ద్రవం ధర రూ. 2500 అని తెలిపారు. పట్టుబడిన ఏడుగురు యువకులను దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరి వద్ద నుంచి 2 కార్లు,1 బైక్ ,2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. ద్రవరూప గంజాయి విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.