Gangula Kamalakar : తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ , ఆయన సోదరుడిపై ఈడీ దాడులకు దిగింది. సీబీఐ దర్యాప్తు బృందం కూడా గంగుల ఇంటికి చేరింది. గ్రానైట్ వ్యవహారంపైనే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నట్లుగా తెలిసింది. గతంలో రెండు రోజుల పాటు గ్రానైట్ సంస్థలు, వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. గంగుల సోదరుడి ఇంటితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి.
మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల కిందట ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో శ్రీనివాసు అనే వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. శ్రీనివాస్ ఐపీఎస్ అధికారి పేరుతో చీటింగ్ కు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే అతన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. గతంలో కాపు సంఘం మీటింగ్ లో మంత్రి గంగులను శ్రీనివాస్ కలిశాడు. ఇప్పుడు ఈ కేసులోనే కమలాకర్ కు నోటీసులు ఇచ్చింది సీబీఐ. మంత్రి నుంచి సమాచారాన్ని సేకరించింది. సాక్షిగా హాజరుకావాలని గంగులకు సీబీఐ నోటీసు ఇచ్చింది