Gajwel : అయిదేళ్లపాటు పదవిలో ఉండే నాయకులకు ఎన్నికలు రాగానే చెమటలు పడతాయి. గెలిచిన తరువాత ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోని నాయకులకు ప్రజల నుంచి వత్యిరేకత రాక తప్పదు. తాజాగా ఇదే సమస్య ఏకంగా సీఎం కేసీఆర్కు ఎదురైంది. ఆయన సొంత జిల్లా.. సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ధరణి పోర్టల్ బాధితులు సామూహికంగా నామినేషన్ వేశారు.
Gajwel : అయిదేళ్లపాటు పదవిలో ఉండే నాయకులకు ఎన్నికలు రాగానే చెమటలు పడతాయి. గెలిచిన తరువాత ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోని నాయకులకు ప్రజల నుంచి వత్యిరేకత రాక తప్పదు. తాజాగా ఇదే సమస్య ఏకంగా సీఎం కేసీఆర్కు ఎదురైంది. ఆయన సొంత జిల్లా.. సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ధరణి పోర్టల్ బాధితులు సామూహికంగా నామినేషన్ వేశారు.
మొత్తంగా 45 మంది కేసీఆర్ బాధితులు నామినేషన్ వేశారు. ఈ 45 మంది అంతా హైదరాబాద్ రాజేంద్రనగర్ వట్టినాగుల పల్లి గ్రామానికి చెందిన శంకర్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులని సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల 460 ఎకరాల భూమి నష్టపోయామని ఆరోపణలు చేశారు. అలాగే జగిత్యాలకు చెందిన కొందరు రైతులు కూడా గజ్వేల్లో నామినేషన్ వేశారు.
మరోవైపు కేసీఆర్ పోటీచేయబోయే కామారెడ్డిలో కూడా ఆయనకు పోటీగా భారీ సంఖ్యలో రైతులు బరితో దిగబోతున్నట్ల తెలిసింది.