Four States Results: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
మధ్యప్రదేశ్ లో బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇక్కడ 230 స్థానాలకు గాను.. బీజేపీ 158 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. కాంగ్రెస్ 62 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ఇక్కడ బీజేపీ హవా కొనసాగుతోంది.
రాజస్థాన్ లోనూ బీజేపీ హవా కనిపిస్తోంది. ఇక్కడ 199 స్థానాలకు బీజేపీ 101 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లో, ఇతరులు 19 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.
ఛత్తీస్ గఢ్ లో బీజేపీ- కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. ఇక్కడ రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 43 స్థానాల్లో, కాంగ్రెస్ 43 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. గతంలో ఇక్కడ బీజేపీ 15 స్థానాలకు పరిమితమవ్వగా.. ఇప్పుడు అంతకు రెండింతల స్థానాల్లో విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో 119 స్థానాలకు గాను.. కాంగ్రెస్ 60 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉండగా.. బీఆర్ఎస్ 42, బీజేపీ 9 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. ఇతరులు 5 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.