Aroori Ramesh Joined in BJP: ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు కాషాయం కండువ కప్పుకున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆరూరి రమేష్ కు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్లు సమచారం. బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిని కేంద్ర హోంమత్రి అమిత్ షాను కూడా కలిసి వరంగల్ లోక్ సభ సీటుపై హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది.