Hyderabad Metro: మెట్రో సర్వీసులు ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రో జనాదరణ పొందింది. ఈ నేపథ్యంలోనే నూతన మెట్రో మార్గాలు కూడా నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలివేటెడ్ మార్గాలు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా ఇప్పుడు మాత్రం భూగర్భం మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులో ఉంది. అయితే రెండో దశలో దీనిని ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్దేవ్ పల్లి, జల్పల్లి, పీ7 రోడ్ , శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 33.1 కిలో మీటర్ల మేర పొడగించనున్నారు. ఈ ప్రతిపాదిక మార్గంలో నాగోల్ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 ఎలివేటెడ్ మార్గం ఉంది. అక్కడ నుంచి పీ 7 రోడ్డు ఎయిర్ పోర్టు ప్రాంగణ సరిహద్దు వరకు 5.28 కిలో మీటర్ల మేర భూమార్గం ఉంది. అయితే అక్కడి నుంచి టెర్మినల్ వరకు 6.42 కిలో మీటర్ల మార్గంలో అండర్ గ్రౌండ్ మార్గం నిర్మించనున్నారు.
Also Read: కనువిందు చేయనున్న 40 ఫీట్ల మట్టి గణపతి, ఫస్ట్ టైం ఓరుగల్లులో..!
నగరంలో ఇదే తొలి అండర్ గ్రౌండ్ మార్గం అవుతుంది. అలాగే ఇక్కడ కార్గో, టెర్మినల్, ఏకోసిటీ స్టేషన్లు కూడా నిర్మించడంతో పాటు డిపోను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ సారి రెండవ దశ మెట్రోలో 1.5 కిలో మీటరుకు ఒక స్టేషన్ ఉండేలా మొత్తం 22 స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో కొన్నింటిని భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ స్టేషన్లుగానూ ఉంచనున్నారు. అలాగే నాగోల్ ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్దేవ్ పల్లి వద్ద ఇంటర్ చేంజ్స్టేషన్లు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తయింది.