Fire Accident In Panjagutta: హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్టలో ఓ పెట్రోల్ బంక్ లో మంటలు అలుముకున్నాయి. పెట్రోల్ బంక్ ట్యాంకులో మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ప్రజాభవన్ సమీపంలోని పెట్రోల్ బంక్ లో ప్రమాదం జరగడంతో గందరగోళం నెలకొంది. మంటలు చెలరేగడంతో వాహనదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే స్థానికులతో పాటు పెట్రోల్ సిబ్బంది పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు సిబ్బంది ఘటనా స్థలంలో చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఫైటర్లను వినియోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది.