Rangareddy Crime News(Local news telangana): ముగ్గురు పిల్లల్ని చంపి, ఆపై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘోరమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న మోకిలా పోలీసులు.. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి(35) పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు.
Read More : రోహిణికి ముందే రోళ్లు పగిలే ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
కొంతకాలంగా స్వగ్రామంతో పాటు ఇతర గ్రామాల ప్రజల నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి రూ.3000, లక్షకు 58 రోజులకు 5 లక్షల రూపాయలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు కట్టించాడు. తీరా చూస్తే.. ఒకటికి రెండు, నాలుగింతలు కాదు కదా.. అసలు కూడా రాలేదు. దాంతో తాము కట్టిన డబ్బంతా తిరిగివ్వాలని రవిని పదే పదే అడిగారు. వారికి సమాధానం చెప్పలేకపోయాడు. వారంతా ఇంటికి రావడంతో ఏం చేయాలో పాలుపోక.. ఇంట్లోనే పిల్లలకు ఉరేసి చంపి.. పంటపొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.