Hyderabad : బస్సులలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బస్సులను తనిఖీ చేశారు అధికారులు.
తనిఖీల్లో భాగంగా ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్కు రవాణా చేస్తున్న 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆరు బస్సుల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సి ప్రాంతాలైన పాడేరు, నర్సీపట్నం, విశాఖ నుంచి బస్సుల ద్వారా స్మగ్లర్లు నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు.
.
.