Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి దగా చేశారని .. రేవంత్ ఒట్టేసి దగా చేసిన ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తానంటూ ఇటీవల హరీష్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఆలయాల యాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం యాదగిరి గుట్ట నరసింహ స్వామిని దర్శించుకుని హరీష్ రావు యాత్రకు అంకురార్పణ చేయనున్నారు.
Also Read: స్పీడు పెంచండి..: రీజనల్ రింగ్ రోడ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి
ఆలయాల యాత్రకు హరీష్ రావు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి వారిని రక్షించాలని, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థిస్తానని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఇతర నాయకులతో కలిసి యాదాద్రిలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతం ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు రుణమాఫీ విషయంలో కొన్ని రోజులుగా హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మా టల యుద్ధం కొనసాగుతోంది.
ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రి దేవాలయం దర్శించుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి… pic.twitter.com/WwPQS3HQOC
— Harish Rao Thanneeru (@BRSHarish) August 21, 2024