BRS Mla Malla Reddy Met karnataka Deputy CM DK Shivakumar(Telangana Politics): పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గులాబీ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. కేసీఆర్ నమ్మిన బంటుగా ఉన్న మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అతని కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అందరు కలిసి కర్ణాటక ఉపముఖ్య మంత్రి డీకే శివ కుమార్ ను కలిశారు. దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నో లింక్..
పార్టీ మారేందుకు మల్లారెడ్డి సిద్దమయ్యారనే వార్తలు ఇప్పుడు తెలంగాణలో బలంగా వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రియాంక గాంధీ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిస్తోంది.