Etela Rajender: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కి మాజీ మంత్రి ఈటల రాజేందర్ దూరంగా ఉన్నారు. హుజురాబాద్ ప్రజలు 2002 నుంచి 7 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు.2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటి చేసి ఓటమి పాలు అయ్యారు. ఓటమి తర్వాత ఈటెల హుజురాబాద్ కి రాలేదు . హుజురాబాద్, గజ్వేల్ లో రెండు స్థానాల నుంచీ పోటీ చేసి.. ఓటమిని చవిచూశారు. ఓటమి తర్వాత ఈటెల రాజేందర్ గజ్వేల్ ప్రజలను కలిశారు.
ఈ క్రమంలో ఆయన హుజురాబాద్ ప్రజలకు దూరంగా ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఈటల మెదక్ ఎంపి సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ప్రజలే తనని ఓడగొట్టారని తన సన్నిహితులతో ఈటల అన్నట్లు సమాచారం. తన ప్రజలని నమ్మితే.. వారే ఓడించారని, అందుకే ఆయన హుజురాబాద్ కి బైబై చెప్పినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
.
.