తెలంగాణ ఎలక్షన్ దంగల్ చివరి దశకు చేరుకుంటోంది. ఓ వైపు పార్టీల ప్రచార పర్వం పీక్స్కు చేరగా.. మరోవైపు ప్రలోభాల పర్వం కూడా అదే స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా పట్టుబడుతున్న నగదే దీనికి సాక్ష్యమని చెప్పాలి. ఓటర్లను ప్రలోభ పెట్టి ప్రసన్నం చేసుకునేందుకు.. నగదు, మద్యంతో పాటు బహుమతులు కూడా పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే 650 కోట్లకు పైగా నగదు.. కేజీల కొద్దీ బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఎలక్షన్ కమిషన్ తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం పట్టుబడుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుబడటం షాక్కు గురి చేస్తోంది. అధికారులు 650 కోట్ల రూపాయల నగదు, మూడున్నర కోట్ల విలువైన మద్యం, కోటి 70 లక్షలు విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా గచ్చిబౌలిలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఐదు కోట్ల నగదు, మూడు సెల్ ఫోన్స్తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్లో రెండు కోట్ల రూపాయల నగదును మూటలు కట్టి కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నాచారంలో ఓ వ్యక్తి నుంచి కోటి 20 లక్షలు. అజీజ్ నగర్లో 7.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఈసీ అధికారులు, పోలీసులు భారీగా మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.
.
.