Telangana IAS Officers Transfers : తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ గా శ్రీదేవిని నియమించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న రిజ్వీకి వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్, హెచ్ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి లను బదిలీ చేసింది. పురపాలకశాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంక, మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేసింది. ట్రాన్స్ పోర్ట్ , హౌసింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వికాస్ రాజ్ ను రవాణా, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు జీఓ విడుదల చేసింది.