E-Paper
Advertisement

Kavitha : ఆ ఫోన్లలో ఏముంది? లోగుట్టు లాగుతున్న ఈడీ ..

Kavitha : ఆ ఫోన్లలో ఏముంది? లోగుట్టు లాగుతున్న ఈడీ ..
Advertisement

Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ జాయింట్ డైరక్టర్ లేఖ రాశారు. విచారణ సమయంలో కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో పేర్కొన్నారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావాలని కోరారు. లేదంటే తన ప్రతినిధిని పంపాలని సూచించారు. దీంతో కవిత తరఫున ఈడీ ముందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లారని సమాచారం.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 11న ఎమ్మెల్సీ కవిత ఫోన్‌ను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. ఈ నెల 21న కవిత మరో 9 ఫోన్లను ఈడీకి అందజేశారు. అయితే సీజ్‌ చేసిన ఫోన్లను ఓపెన్‌ చేసేందుకు సాక్షిగా కవిత గానీ, ఆమె ప్రతినిధి గానీ రావాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు లీగల్‌ అడ్వైజర్‌ సోమా భారత్‌కు ఆథరైజేషన్‌ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి విచారణకు కవిత పంపారని తెలుస్తోంది.

Advertisement

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటి వరకు మూడుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 11, 20, 21 తేదీల్లో ఈడీ అధికారులు ఆమె ప్రశ్నించారు. కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ అయ్యారు. కవితను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగినా .. మూడుసార్లు విచారించి పంపించారు.

Related News

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×