E-Paper
Advertisement

TSPSC : పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ..

TSPSC :  పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ..
Advertisement

TSPSC Paper Leak Case : పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలను తీసుకోవాలని నిర్ణయించింది. వారి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసింది.

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ భావిస్తోంది. మనీలాండరింగ్‌ జరిగినట్లు అనుమానిస్తోంది. సిట్‌ అధికారులు సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మిపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీఎస్‌పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని కోరింది. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్‌ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఈడీ ప్రశ్నించనుంది.

Advertisement

మరోవైపు TSPSC కేసులో సిట్‌ హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఈ కేసును సిట్ అధికారులు నెల రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 150 మందిని విచారించారు. 17 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 15 మందిని కస్టడీకి తీసుకుని కీలక సమాచారం సేకరించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డి వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితుల పెన్‌డ్రైవ్, మొబైళ్లలో ప్రశ్నపత్రాలు ఉన్నట్లు గుర్తించారు. సెంట్రల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ నివేదిక ఈ కేసులో కీలక కానుంది. ఆ వివరాలను సిట్ హైకోర్టుకు సమర్పిస్తుంది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×