EC Notices to KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీఐ అడ్వైజరీ కమిటీ లేఖను సీఈఓ వికాస్ రాజ్ సీఎం కేసీఆర్ కు పంపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేసీఆర్.. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసగించకూడదని తెలిపింది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై.. కేసీఆర్ బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేసీఆర్ ప్రసంగం కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలను పెంచేలా ఉందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియామళి ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీఐ స్పష్టం చేసింది. ఇకపై అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. కాగా.. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఈసీ విచారణకు ఆదేశించింది. స్థానిక రిటర్నింగ్ అధికారి నవంబర్ 14న ఈసీకి నివేదిక సమర్పించగా.. దాని ఆధారంగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.