Bellampalli : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ సర్వే చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎలా ఉందో సర్వే ద్వారా తేల్చింది. బెల్లంపల్లి సెగ్మెంట్ లో 1, 69, 759 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 84,790 మంది. మహిళా ఓటర్లు 84, 796 మంది. ప్రస్తుతం ఎమ్మెల్యే గా దుర్గం చిన్నయ్య ఉన్నారు. ఆయనకే తిరిగి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి జి. వినోద్ పోటీలో ఉన్నారు.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (25-09-2023)..
బిగ్ టీవీ చేపట్టిన పందెం కోళ్లు-1 సర్వేలో కాంగ్రెస్ కు ఎడ్జ్ కనిపించింది. హస్తం పార్టీకి 47 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 43 శాతం, బీజేపీకి 5 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 ( 03-11-2023)..
తాజాగా చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ కు 44 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు వస్తాయని తేలింది. గత సర్వే కంటే ఓట్ల లెక్కలు మారాయి.
సమీకరణాలు ..
గత సర్వే కంటే కాంగ్రెస్ కు 3 శాతం, బీఆర్ఎస్ కు 2 శాతం ఓట్లు తగ్గగా.. బీజేపీకి 3 శాతం ఓట్లు పెరిగాయి.
బెల్లంపల్లిలో కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే ద్వారా వెల్లడైంది. అయితే బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని తేలింది. బీజేపీ సాధించే ఓట్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపోటములు నిర్ణయిస్తాయనే అంచనా ఉంది.
.
.