Droupadi Murmu: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు వచ్చారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఐదు రోజుల పాటు బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న డిల్లీకి వెళ్లనున్నారు.