Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కళను విభిన్న కళగా అభివర్ణించారు. చేనేత మగ్గాలను ఆమె పరిశీలించారు. టై అండ్ డై ఇక్కత్ పట్టుచీరల తయారీని చూశారు.
పోచంపల్లి చేనేత కార్మికులను కలవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి. పోచంపల్లిలో చేనేత కార్మికులు తయారు చేసిన వివిధ వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. వస్త్రాల తయారీలో చేనేత కార్మికుల కృషి అభినందనీయం అన్నారు. విభిన్నమైన చేనేత వస్త్రాల తయారీ కళను భవిష్యత్ తరాలకు అందించేందుకు చేనేత కార్మికుల చేస్తున్న ప్రయత్నం హర్షణీయం అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుని .. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు.