EPAPER

Diwali Bonus : దీపావళి బోనస్ రూ.85 వేలు.. 3.50 లక్షల మందికి లబ్ధి..

Diwali Bonus : దీపావళి బోనస్ రూ.85 వేలు.. 3.50 లక్షల మందికి లబ్ధి..

Diwali Bonus : ఏవైనా పండుగల సందర్భంలో పలు కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లు, ఇంక్రిమెంట్లు ఇస్తుంటుంది. ఇటీవల తమిళనాడులో ఒక యజమాని తన కంపెనీ ఉద్యోగులకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లను దీపావళి గిఫ్టులుగా ఇచ్చారు. మరొకరు కార్లను గిఫ్టులుగా ఇచ్చారు. తాజాగా.. బొగ్గుగని కార్మికులకు కూడా దీపావళి బోనస్ ఇస్తున్నట్లు కోల్ ఇండియా యాజమాన్యం వెల్లడించింది.


ఒక్కో ఉద్యోగికి రూ.85 వేల చొప్పున ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్ ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున బోనస్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళికి రూ.76,500 బోనస్ చెల్లించగా.. ఈ ఏడాది రూ.1.20 లక్షలు బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టగా.. రూ.8500 పెంచి.. రూ.85000 చెల్లిస్తామని చెప్పింది. కాగా.. పీఎల్ఆర్ బోనస్ ను సింగరేణి కార్మికులకు దీపావళికి 7-10 రోజుల ముందు చెల్లిస్తుండగా.. ఇతర ప్రాంతాల వారికి దసరా ముందు చెల్లిస్తున్నారు.


Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×