Kancharla Bhupal Reddy : నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ముసలం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి టికెట్ ఇవ్వడం నచ్చని అసమ్మతి నేతల రాగం కంటిన్యూ అవుతోంది. అభ్యర్థిని మార్చకపోతే ఎమ్మెల్యేను ఓడించి తీరుతామంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ.. తమ గళాన్ని వినిపిస్తుండటంతో ఈ ఎన్నికల్లో భూపాల్రెడ్డి ఓటమి తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్ అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి సమరశంఖాన్ని పూరించారు. అయితే.. నల్గొండ జిల్లాలో మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయడం అక్కడి కొందరు నేతలకు నచ్చలేదు. దీంతో పిల్లి రామరాజుయాదవ్, చాడ కిషన్రెడ్డిలు సహా పలువురు ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మంత్రి కేటీఆర్ టూర్కు దూరంగా ఉన్నారు. ఇక మరోపక్క ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి తమ అసమస్మతి గళాన్ని వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నల్గొండ కౌన్సిలర్, మాజీ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న రామరాజుయాదవ్ బరిలో నిలిచేది తానేనంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ.. తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తుండటంతో ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్కు ఓటమి తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.