Damodara raja narasimha: జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జూడాలతో చర్చలు జరిపారు. స్టై ఫండ్ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల 15 లోపు స్టైఫండ్ వచ్చేలా చూస్తామన్నారు.
హాస్టళ్లలో వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త హాస్టల్స్ కూడా నిర్మిస్తామని ప్రకటించారు. ప్రతి ఒక్కరు హాస్టల్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీటితోపాటు మిగతా సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చినా హామీలతో సమ్మెను జూడాల విరమిస్తున్న ప్రకటించారు.
గత మూడు నెలలుగా స్టై ఫండ్ అందకపోవడంతో మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మె చేయాలని నిర్ణయించారు. అయితే జూడాలతో సోమవారం హెల్త్ సెక్రటరీతో సమావేశం అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి జూడాల సమస్యను చర్చిస్తారని హెల్త్ సెక్రటరీ హామీ ఇచ్చారు. దీంతో జూడాలతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో జూడాల సమ్మెకు బ్రేక్ పడింది.