Hyderabad: పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతూ హైటెక్ విధానంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అమాయకపు అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గ్గా చేసుకొని వాట్సాప్, వెబ్సైట్ల ద్వారా అమ్మాయిల ఫొటోలు పంపించి ఎర వేస్తున్నారు.
హైదరాబాద్లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ విధానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా.. వారిలో ఓ ప్రముఖ తెలుగు డైరెక్టర్ అసిస్టెంట్ సురేష్ బోయిన కూడా ఉన్నాడు. సురేష్ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ అమ్మాయిలను మోసం చేసి వ్యభిచారంలోకి దింపుతున్నాడని పోలీసులు తెలిపారు.
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ట్రాప్ చేసి.. హైదరాబాద్తో పాటు గోవా, బెంగళూరు, ముంబైలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని వెల్లడించారు. ఇప్పటి వరకు సురేష్ బారిలో పడి దాదాపు 500 మంది అమ్మాయిలు వ్యభిచార కూపంలో చిక్కుకున్నట్లు తెలిపారు.