Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు రెండు ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన మిర్చి తోట చేతికి అంది వచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో యాకయ్య కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.