CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీపై రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నోటీసులు కోర్టు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో బీజేపీపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని ఆరోపించారు. అంతే కాకుండా రేవంత్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేసారు.
బీజేపీ నేత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి బీజేపీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించనుందని ప్రచారం చేశారు. అంతే కాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ చేయడంతో పాటు బండి సంజయ్ తదితర బీజేపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించడంతో రేవంత్ రెడ్డి పరువు నష్టం కలిగించారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , అజయ్ కుమార్ తదితరులు నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు.
Also Read: ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత..ఎయిమ్స్కు తరలింపు
ఈ ఫిర్యాదును కోర్టు స్వీకరించకపోవడంతో హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం వీలైనంత త్వరగా సదరు ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నాంపల్లిలోని స్పెషన్ జ్యుడీషియన్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఫిర్యాదుపై విచారణ చేపట్టి సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.