Couple Died Due To Current Shock(Local news telangana): వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బొంరాస్పేట మండలంలోని బురాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాజాద్ జిల్లాలోని బురాన్పూర్కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్ (48), లక్ష్మి (42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు సమీపంలో దుస్తులు ఆరేసేందుకు వైరుతో తీగలు ఏర్పాటు చేసుకున్నారు.
Read More: రైతు బీమా, రైతు బంధు డబ్బు స్వాహా.. ముగ్గురు అరెస్ట్
దుస్తులు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు కరెంట్ పాస్ అయింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.