EPAPER

Munugode : కౌంట్ డౌన్ షురూ.. మునుగోడులో హై టెన్షన్…

Munugode : కౌంట్ డౌన్ షురూ.. మునుగోడులో హై టెన్షన్…

Munugode : మునుగోడు మూగబోయింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. ఎక్కడివారక్కడే గప్ చుప్. బయటి వాళ్లకి బై బై చెప్పేసి.. స్థానికులు నోట్ల వేటలో బిజీ అయ్యారు.


పార్టీలకు పోటీగా ఎన్నికల సంఘం, పోలీసులు సైతం వేటకు రెడీగా ఉన్నారు. పోలీసులు మునుగోడు నియోజకవర్గాన్ని అష్టదిగ్బంధనం చేసేశారు. సరిహద్దుల్లో వంద చెక్ పోస్టులు పెట్టారు. భారీగా బలగాలను మోహరించారు. సాయంత్రం 6 నుంచి తనిఖీలు పెంచేశారు. వాహనాల సోదాలతో పాటు ప్రతీ ఇంటిని జల్లడపట్టే పనిలో ఉన్నారు.

105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది ఈసీ. 3వేల మందికి పైగా రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను తరలించింది. మంగళవారం పలివెలలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు దాడులకు తెగబడటంతో మరిన్ని అదనపు బలగాలను మునుగోడుకు తరలిస్తోంది ఎన్నికల సంఘం. 200 పోలీస్ బృందాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. అక్రమ నగదుపై కన్నేసి ఉంచడానికి ఐటీ టీమ్స్ రెడీగా ఉన్నాయి.


మంగళవారం సాయంత్రం ప్రచార సమయం ముగిశాక.. బయటి వారెవరూ నియోజకవర్గంలో ఉండకూడదు. ప్రధాన మీడియాతో పాటు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలోనూ ఎలాంటి ప్రచారం చేయకూడదు. బల్క్ మెసేజ్ లపై నిషేధం ఉంది.

మునుగోడులో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 51 బృందాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయి. ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ ఎలా జరుగుతుందోననే టెన్షన్ టెన్షన్..

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×