ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెడుతున్న ఆకర్షణీయ స్కీమ్లు.. అధికార పార్టీ నేతల జేబు పథకాలుగా మారిపోయాయి. పేదలు, అర్హులకు చెందాల్సిన పథకాలు.. అధికార పార్టీ నేతల అనుచరులు, బంధుగణాలకు అందుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కృష్ణవేణి భర్త భూమయ్యకు బీసీ బంధు సాయం అందింది. ఈ వ్యవహారంతో అధికార పార్టీ అక్రమాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పథకాలు ఇచ్చేది వాళ్లే.. తీసుకునేదీ వాళ్లేనా అంటూ మండిపడుతున్నారు అర్హులు.
బీఆర్ఎస్ కార్పొరేటర్ కల్వచెర్ల కృష్ణవేణి భర్త కల్వచెర్ల భూమయ్య RFCLలో ఉద్యోగి. అయితేనేం అధికారపార్టీ కావడంతో.. నిబంధనలకు విరుద్ధంగా భూమయ్య ధృవీకరణ పత్రాలు సంపాదించాడు. ఆ అక్రమ పత్రాలతో బీసీ బంధు కొట్టేశాడు.
భూమయ్యతో పాటు.. ఆ అక్రమ పత్రాలు ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? అనే కోణంలోనూ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.