Corporator Kidnapped : జవహర్నగర్లో కార్పొరేటర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. కార్పొరేటర్ కిడ్నాప్ వెనుక జవహర్నగర్ మేయర్ తండ్రి అయ్యప్ప, అతని అనుచరుల హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న కలెక్టరేట్లో మేయర్ కావ్యపై ఆవిశ్వాసానికి సిద్ధం కావడంతో.. రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాసానికి 10వ వార్డు కార్పొరేటర్ గండి రాంచందర్ ప్రేరేపిస్తున్నాడనే కోపంతో మేయర్ తండ్రి కిడ్నాప్ చేశారని పలువురు అంటున్నారు. అంతేకాకుండా గతంలో 18 మంది కార్పొరేటర్లు టూర్కు వెళ్లారు. వారితో పాటే టూర్కు వెళ్లొద్దంటూ రాంచందర్ ని మేయర్ తండ్రి అయ్యప్ప అడ్డుకుని బెదిరించారు.
అయ్యప్ప, అతని అనుచరుల నుండి తప్పించుకున్న ఆయన.. ORR మీదుగా వెళ్తుండగా చేజ్ చేసీ మరి కిడ్నాప్ చేశారు. మేయర్ తండ్రి అయ్యప్ప, అనుచరగణం కిడ్నప్ చేస్తుండగా చుసిన మరో కార్పొరేటర్ సత్యనారాయణ.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అడ్డుకుని బెదిరించి రాంచందర్ను లాక్కెళ్లారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.